వైకాపా గూటికి జెసి

 

సార్వత్రిక ఎన్నికలు దగ్గర పడుతుండటంతో పాటు, తెలంగాణ రాష్ట్ర ఏర్పాటుకు కాంగ్రెస్‌ అధిష్టానం వడి వడిగా అడుగులు వేస్తుండటంతొ ఆ పార్టీ సీమాంద్ర నాయకులు ఇక ప్రత్యామ్నాయాలపై దృష్టిపెడుతున్నారు. ఇప్పటికే పలువురు నాయకులు పార్టీకి గుడ్‌బై చెప్పి వైయస్‌ఆర్‌ కాంగ్రెస్‌లో చేరుతుండగా తాజాగా అనంతపురంలో మరోషాక్‌ తగలనుంది.

అనంతపురం జిల్లాలొ కాంగ్రెస్‌ పార్టీకి బలమైన నాయకునిగా ఉన్న జెసి దివాకర్‌ రెడ్డి అధిష్టానంపై తీవ్ర అసంతృప్తితో ఉన్నారు. అందుకే ఆయన తనయుడు పవన్‌ వైసిపి పార్టీ వైపు చూస్తున్నారు. 2014 ఎన్నికల్లో రాజకీయ రంగ ప్రవేశం చేయాలని భావిస్తున్నారట. ఇప్పటి వరకు జిల్లాలో బలమైన వర్గంగా ఉన్న జెసి వైయస్‌ఆర్‌ కాంగ్రెస్‌లో చేరటంతో కాంగ్రెస్‌ ఆ జిల్లాలో తుడిచిపెట్టుకుపోయే పరిస్థితి ఏర్పాడింది.