కన్ను లొట్టపోయిందిట..

 

ఇప్పటికే కాంగ్రెస్‌ పార్టీకి ఓ కన్ను లొట్టపోయిందని ఆ పార్టీ ఎమ్మెల్యే జెసి దివాకర్‌ రెడ్డి వ్యాఖ్యానించారు. విభజన నిర్ణయం కారణంగా దాపురించిన పరిస్థితుల్ని అభివర్ణిస్తూ ఆయన గురువారం ఈ కామెంట్‌ చేశారు. ఈ కాంమెట్‌ చేస్తున్నప్పుడు ఆయన తన ఎడమ కన్నును ఒకటికి రెండు సార్లు మూసి తెరిచి, దానిని చూపిస్తూ ఏకపాత్రాభినం కూడా చేసేశారు. మరి ఆయన దృష్టిలో పార్టీ పరిస్థితి బాగున్న కన్ను ఏప్రాంతామో.. ఆయనే చెప్పాలి. అంతా బాగానే ఉంది కానీ.. ఈ సందర్భంగా ఆయన ఇంకో విచిత్రమైన విషయం కూడా చెప్పారు అదేమిటంటే.. రాష్ట్రం విడిపోతే కిరణ్‌ పార్లీ పెట్టరట. సమైక్యంగా ఉంటేనే పెడతారట. పనిలో పనిగా జగన్‌ పార్టీ సమైక్యం కోసం బాగా ప్రత్నిస్తున్నారని అభినందనలు కూడా అందించేశారు. ఏమిటి జెసి గారూ. ఒకే రోజు మీరిన్ని నిజాలు చెబితే జనం జీర్ణించుకోవద్దూ..