జేసీకి జగన్ షాక్
posted on Dec 26, 2013 3:54PM
వైకాపా అధ్యక్షుడు జగన్ మోహన్ రెడ్డి అన౦తపురం జిల్లా తాడిపత్రి ఎమ్మెల్యే అభ్యర్ధిగా సరోజమ్మను ప్రకటించడంతో మాజీ,మంత్రి జేసీ దివాకర్ రెడ్డి గారు ఇరకాటంలో పడ్డారు. ఇటు టీడీపీ జగన్ పార్టీల మధ్య జేసీ ఊగిసలాడుతుంటే జగన్ మాత్రం తరచూ జేసీ మీద పోటీ చేస్తున్న తాడిపత్రి మాజీ మున్సిపల్ చైర్మన్ పేరం నాగిరెడ్డిని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో చేర్చుకున్నాడు. క్రిస్ మస్ సంధర్భంగా ఆయన జగన్ సమక్షంలో పార్టీలో చేరాడు. 30 ఏళ్లుగా తెలుగుదేశం పార్టీలో ఉన్న చంద్రబాబు నాయుడు నుండి ఒరిగింది ఏమీ లేదని నాగిరెడ్డి ప్రకటించారు. రెండు రోజుల క్రితం జెసి మాటలను చూస్తే ఆయన జగన్ వైపు వెళ్తారని భావించారు. ఇప్పుడు పేరం జగన్ పార్టీలోకి వెళ్లడంతో జెసి సోదరులకు తెలుగుదేశం పార్టీ ఒక్కటే ప్రత్యామ్నాయం అంటున్నారు.