జయేంద్ర సరస్వతికి తీవ్ర అస్వస్థత..

ప్రముఖ హిందూ ఆధ్యాత్మిక గురువు, కంచి కామకోటి పీఠాధిపతి స్వామి జయేంద్ర సరస్వతి ఈ ఉదయం తీవ్ర అస్వస్థతకు గురయ్యారు. శ్వాస తీసుకోవడంలో ఆయన ఇబ్బంది పడుతుండటతో శిష్యులు విజయవాడ సూర్యారావుపేటలోని ఆంధ్రా ఆసుపత్రిలో చేర్చారు. ఆయనకు ప్రస్తుతం ఐసీయూలో అత్యవసర చికిత్స జరుగుతున్నట్టు సమాచారం. ఐదుగురు సభ్యుల వైద్యుల బృందం పర్యవేక్షణలో స్వామి ఆరోగ్య పరిస్థితిని సమీక్షిస్తున్నారు. జయేంద్ర సరస్వతి ఆరోగ్య విషయం తెలుసుకున్న ఆయన అభిమానులు, భక్తులు ఆంధ్ర హస్పటల్ వద్దకు భారీగా చేరుకుంటున్నారు.