కాంగ్రెస్ పై జయసుధ విమర్శలు

కాంగ్రెస్ పార్టీలో కష్టపడేవారికి గుర్తింపులేదని సికింద్రాబాద్ మాజీ ఎమ్మెల్యే జయసుధ ఆవేదన వ్యక్తం చేశారు. డబ్బులు ఉన్నవారికే పార్టీలో ప్రాధాన్యత ఇస్తుందని, కాంగ్రెస్ పార్టీ ఓడిపోవడానికి కాంగ్రెస్ పార్టీయే కారణమని ఆరోపించారు. యూత్ కాంగ్రెసు పార్టీని బలోపేతం చేయాల్సిన అవసరం ఉందన్నారు. ఇకనైనా యూత్ కాంగ్రెస్‌కు ఎన్నికలు జరపాలని ఆమె విజ్ఞప్తి చేశారు. 2009లో కాంగ్రెసు పార్టీ ద్వారా రాజకీయరంగ ప్రవేశం చేసిన జయసుధ పోటీ చేసి తొలిసారే గెలుపొందారు. అయితే, 2014 సార్వత్రిక ఎన్నికల్లో ఆమె ఓటమి చవి చూశారు.