అమ్మకు పవన్ కళ్యాణ్ సంతాపం..
posted on Dec 6, 2016 12:18PM
తమిళనాడు మృతిపట్ల పలువురు ప్రముఖులు ఇప్పటికే తమ సంతాపాన్ని తెలియజేశారు. రాజకీయ, సీని రంగానికి చెందిన పలువురు ఇప్పటికే జయ భౌతిక కాయానికి నివాళులు అర్పించారు. కొందరు సోషల్ మీడియాలో జయకు సంతాపం ప్రకటించారు. దీనిలో భాగంగానే సినీ నటుడు, జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ ట్విట్టర్ ద్వారా అమ్మకు సంతాపం తెలిపాడు. జయలలిత మరణం తనని తీవ్ర దిగ్భ్రాంతికి గురి చేసిందని, భారతీయ రాజకీయాలపై ఆమె చెరగని ముద్ర వేసారని పవన్ అన్నాడు. జయలలిత బడుగు, బలహీన వర్గాల అభ్యున్నతే ఆశగా,శ్వాసగా జీవించారని.. అమ్మ మరణం తమిళ నాడుకే కాక యావత్ దేశానికి తీవ్ర లోటు అని ఆమెకు మనః పూర్వక అంజలి ఘటిస్తూ తన తరపున, జనసేన పార్టీ శ్రేణుల తరపున సంతాపం వ్యక్తం చేస్తున్నట్టు తెలిపాడు.