అమ్మకు ప్రముఖులు సంతాపం..

 

జయలలిత మృతికి పలువురు ప్రముఖులు సంతాపం తెలుపుతున్నారు. నిన్నరాత్రి చెన్నైలోని అపోలో ఆస్పత్రిలో చికిత్స పొందుతూ జయలలిత తుదిశ్వాస విడిచారు. దీంతో తమిళనాడు మొత్తం కన్నీటిపర్యంతమైంది. ఇక జయలలిత మృతి రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జి, ప్రధాని నరేంద్ర మోడీ దిగ్బ్రాంతి వ్యక్తం చేశారు. సంక్షేమ కార్యక్రమాలతో జయలలిత పేదలకు దగ్గరయ్యారని మోడీ అన్నారు. కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలు సోనియాగాంధీ, ఉపాధ్యక్షుడు  రాహుల్‌గాంధీ జయలలిత మృతిపట్ల నివాళులర్పించారు. దేశరాజకీయాల్లో జయలలిత లేని లోటు తీర్చలేనిదని సోనియాగాంధీ ఆవేదన వ్యక్తం చేశారు. ఇక తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్, ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు జయలలితకు నివాళులర్పించారు.