అమ్మ గదిలో ఏముందో..?

 

తమిళనాడు దివంగత ముఖ్యమంత్రి జయలలిత మరణానంతరం...వరుసపెట్టి ఐటీ దాడులు జరుగుతున్న సంగతి తెలిసిందే కదా. ఇప్పటికే శశికళ.. దినకరన్.. ఇంకా శశికళ కుటుంబసభ్యుల ఇళ్లల్లో ఐటీ అధికారులు దాడులు జరిపి వేల కోట్ల ఆస్తులు స్వాదీనం చేసుకున్నారు. అయితే జయలలిత మరణించిన తరువాత ఆమె డెత్ ఎంత మిస్టరీగా మారిందో... ఆమెకు సంబంధించిన ఆస్తుల గురించిన విషయాలు కూడా అంతే రహస్యంగా ఉన్నాయి. ఇటీవల జయలలిత కొడనాడ్ ఎస్టేట్ లో కూడా ఆమె ఆస్తులకు సంబంధించి.. కీలక పత్రాలు దొంగిలించారు. ఇక ఇప్పుడు శశికళ, ఆమె బంధువర్గమే లక్ష్యంగా జరుగుతున్న ఐటీ దాడులు కీలక దశకు చేరుకున్న వేళ.... పోయిస్ గార్డెన్స్ లోని వేదనిలయంలో జయలలిత పర్సనల్ గదిని నేడు తెరిచి, అందులో ఏముందో తేల్చాలని ఆదాయపు పన్ను శాఖ అధికారులు నిర్ణయించుకున్నారు. గతంలో కూడా ఐటీ అధికారులు వేదనిలయంలో సోదాలు జరిపారు. కానీ అప్పుడు జయ ఆంతరంగిక గదుల జోలికి వెళ్లలేదు. కానీ ఇప్పుడు ఆమె గదిలో ఏముందో తేల్చాలని నిర్ణయించుకున్నారు. దీనిలో భాగంగానే... ఐటీ అధికారులు ఆమె ఇంటికి వెళ్లారు. ఇప్పటివరకూ చిన్నమ్మ సామ్రాజ్యంపై విరుచుకుపడిన ఐటీ, ఇప్పుడు జయలలిత ఏం దాచుకుందో తేల్చనున్నారు. ఇక ఐటీ అధికారులు అమ్మ ఇంటికి వెళ్లడంతో... తమిళనాడు మొత్తం అసలు ఆ గదిలో ఏముంది... ఆమె మాత్రమే వాడిన గదిలో ఏం దాచారని... ఐటీ అధికారులు ఏం నిజాలు బయట పెడతారని ఎదురుచూస్తున్నారు. మరోపక్క అన్నాడీఎంకే శ్రేణులు కూడా భారీ ఎత్తున అక్కడకు చేరుకున్నాయి. మరి ఎన్నో రహస్యాలు దాగి ఉన్న జయలలిత జీవితంలో.. ఇప్పటివరకూ దేనికి సరైన సమాధానం అన్నదే దొరకలేదు. ఆఖరికి తన మరణం కూడా. మరి ఇన్ని రోజులు రహస్యంగా... ఎవరినీ రానివ్వకుండా ఉన్న ఆమె గదిలో ఏముందో..? అధికారులు ఏం బయటపెడతారో చూద్దాం..?