జయలలిత వేద నిలయం రూం వెనుక మిస్టరీ ఇదా..?

 

తమిళనాడు దివంగత ముఖ్యమంత్రి జయలలిత ఎప్పడైతే మరణించారో..అప్పటినుండి తమిళనాడు రాజకీయాల్లోకానీ.. ఆమెకు సంబంధించిన పోయెస్  గార్డెన్ గురించి కానీ ఎదో ఒక ట్విస్ట్ చోటుచేసుకుంటూనే ఉంది. ఇప్పుడు తాజాగా మరో వార్త చక్కర్లు కొడుతుంది. అదేంటంటే... అమ్మకు సంబంధించిన వేద నిలయం గురించి. గతంలో జయలలితకు సంబంధించిన గెస్ట్ హౌస్ లో వాచ్ మెన్ ను హత్య చేసిన సంగతి తెలిసిందే. గెస్ట్ హౌస్ లో జయలలిత ఆస్తులకు సంబంధించిన కీలకమైన దస్తావేజులు, డాక్యుమెంట్లను దగ్ధం చేశారు. ఇప్పుడు అమ్మ ఆస్తులకు సంబంధించి మరో సంచలనమైన వార్త చక్కర్లు కొడుతుంది. అమ్మ వేదనిలయంలోని ఒక గది ఇప్పుడు హాట్ టాపిక్ అయింది. పొయెస్ గార్డెన్‌లోని వేదనిలయం తమకు చెందాలంటే తమకు చెందాలని ఆమె స్నేహితురాలు శశికళ, మేనకోడలు దీపాజయకుమార్, అన్నాడీఎంకే పార్టీ, కేంద్ర ప్రభుత్వం కోసం ప్రయత్నిస్తుంది. దీనంతటికి కారణం అమ్మ మీద ఉన్న ప్రేమే అనుకుంటే పప్పులో కాలేసినట్టే. ఇంతకీ ఆ గదిలో ఏముందనుకుంటున్నారా..? జయలలిత సంపాదించిన సొత్తు మొత్తాన్ని వేద నిలయంలోని ఒక రహస్య గదిలో దాచి పెట్టారని, దాన్ని తెరవడం అంత సులభం కాదని అనుకుంటున్నారు. ఆ గదికి సంబంధించిన బయోమెట్రిక్ కీ జయలలిత దగ్గరే ఉందని, ఆమె కాలి ముద్రలతో మాత్రమే ఆ రహస్య తలుపును తెరవగలరని చెప్పుకుంటున్నారు. అంతేకాదు జయలలిత అంతిమయాత్రలో ఆమె భౌతిక కాయాన్ని చూసిన కొందరూ ఆమెకు కాళ్లు లేవని అనుమానం వ్యక్తం చేయడం ఇప్పుడు అందరికీ గుర్తొచ్చింది. ఇంతకీ ఈ సీక్రెట్ గది నిజమా? కల్పనా? అన్న దానిపై కూడా అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. మరి దీని మిస్టరీ వీడాలంటే వెయిట్ చేయాల్సిందే.