జవహర్ కమిటీ... ఆర్టీసీ సమావేశంలో ఆగ్రహావేశాలు

 

ఆర్టీసీ పాలక మండలి సమావేశంలో ఆగ్రహావేశాల కారణంగా గందరగోళం నెలకొంది. రాష్ట్ర విభజన నేపథ్యంలో సంస్థ ఆస్తులు, అప్పుల పంపిణీకి సంబంధించి జవహర్ కన్సల్టెన్సీ సంస్థ రూపొందించిన నివేదిక ఈ గందరగోళానికి దారి తీసింది. ఈ సమావేశంలో నివేదికపై తెలంగాణకు చెందిన మజ్దూర్ యూనియన్, ఎంప్లాయీస్ యూనియన్ల నాయకులు వ్యక్తం చేసిన అభ్యంతరాలు భేటీలో రసాభాసకు దారితీశాయి. ఆస్తులు, అప్పుల పంపిణీకి సంబంధించిన కన్సల్టెన్సీ నివేదిక తప్పులతడకగా ఉందని కార్మిక సంఘాలు ఆరోపించాయి. ఆర్టీసీ రెండు ప్రధాన కార్మిక సంఘాల అభ్యంతరాల నేపథ్యంలో అధికారులు సమావేశాన్ని వాయిదా వేశారు.