విశాఖలో జనసేన బహిరంగ సభ
Published on: Sat Aug 30, 2025 9:23AM

విశాఖలో సేనతో సేనాని పేరిట జనసేన శనివారం భారీ బహిరంగ సభ నిర్వహించనుంది. ఈ సభ కోసం రాష్ట్రవ్యాప్తంగా భారీ ఎత్తున జనసేన క్రియాశీల కార్యకర్తలు విశాఖ నగరానికి చేరుకున్నారు. విశాఖ వన్ టౌన్ ఇందిరా ప్రియదర్శిని స్టేడియం వేదికగా ఈ బహిరంగ సభ జరగనుంది ఇప్పటికే మూడు రోజుల కార్యక్రమం కోసం పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ విశాఖలో బస చేశారు.
రాష్ట్రవ్యాప్తంగా దాదాపు 15 వేల మంది క్రియశీలక కార్యకర్తలు ఈ బహిరంగ సభ కు హాజరయ్యే అవకాశం ఉంది మధ్యాహ్నం ఒంటిగంట నుంచి ఈ కార్యక్రమం మొదలవుతుంది ఈ బహిరంగ సభ వేదికకు అల్లూరి సీతారామరాజు ప్రాంగణంగా నామకరణం చేశారు. విశాఖ నగర వ్యాప్తంగా జనసేన జెండాలు, ఫ్లెక్సీలు కటౌట్లు ఏర్పాటు చేశారు.


