ఆ ఒక్క ఎమ్మెల్యే ఒక్క విమర్శకే తట్టుకోలేక పోతున్నారా !!

 

 

ఎవరినైనా పొగిడినంతవరకు బాగానే ఉంటుంది, కానీ ఒక సారి విమర్శించటం  మొదలెడితే అప్పుడు తెలుస్తుంది అవతలి వారి ప్రతాపం. ప్రస్తుతం జనసేన తరుఫున గెలిచిన ఒక్కగానొక్క ఎమ్మెల్యే పరిస్థితి ఇలానే ఉందని అంటున్నాయి జనసేన వర్గాలు. మొన్న జరిగిన కొత్తగా ఏర్పడిన అసెంబ్లీ సమావేశాలలో జగన్ ప్రభుత్వాన్ని దేవుడి తో పోల్చిన జనసేన ఎమ్మెల్యే రాపాక వరప్రసాద్ కొద్ది రోజుల క్రితం తిరుమల సందర్శన సందర్బంగా అదే జగన్ ప్రభుత్వాన్ని విమర్శించినా సంగతి తెలిసిందే. ఇప్పుడు తాజాగా రాపాక వరప్రసాద్ ను మలికిపురం పోలీస్ స్టేషన్ ఎస్సై దుర్భాషలాడుతూ కాల్చేస్తా అంటూ బెదిరింపులకు పాల్పడేసరికి అక్కడ జనసేన శ్రేణులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.ఏదైనా సమస్య ఉంటె సామరస్యంగా పరిష్కరించుకోవాలని రాపాక సూచించగా ఆ ఎస్సై అత్యుత్సాహం ప్రదర్శించాడని రాజకీయ వర్గాలు పేర్కొంటున్నాయి. జగన్ ప్రభుత్వాన్ని పై ప్రసంశలు కురిపించినంత కాలం అంతా బాగానే ఉందని కానీ ఒక్క సారి విమర్శించగానే ప్రతిఫలంగానే ఇలా చేస్తున్నారని జనసేన వర్గాలు అంటున్నాయి. ఏది ఏమైనా ఎమ్మెల్యే రాపాకను దుర్భాషలాడిన ఆ అధికారిని మాత్రం ఎట్టి పరిస్థితుల్లో క్షమించకూడదని జనసేన వర్గాలు పట్టుదలగా ఉన్నట్లు తెలుస్తోంది.