జానాకు అస్వస్థత.. యశోదలో చికిత్స
Published on: Wed Apr 12, 2023 11:14AM
కాంగ్రెస్ సీనియర్ నేత, మాజీ మంత్రి జానారెడ్డి అస్వస్థతకు గురయ్యారు. ప్రస్తుతం ఆయనకు సోమాజిగూడలోని యశోద ఆసుపత్రిలో చికిత్స అందిస్తున్నారు.
ప్రస్తుతం ఆయన ఆరోగ్య పరిస్థితి నిలకడగా ఉందని వైద్యులు తెలిపారు. మోకాలి చికిత్స కోసం యశోద ఆసుపత్రికి వెళ్లిన జనారెడ్డికి వైద్యులు పరీక్షలు నిర్వహిస్తుండగా ఆయన గుండె రక్త నాళాలలో ఒకటి పూర్తిగా బ్లాక్ అయినట్లు గుర్తించారు.
దీంతో ఆయనకు నిన్న రాత్రి స్టంట్ వేశారు. ప్రస్తుతం జానా రెడ్డి ఆసుపత్రిలో అబ్జర్వేషన్ లో ఉన్నారు.


