పాపం సీనియర్ నేత జానారెడ్డికి తప్పని ఓటమి

 

తెలంగాణ ఎన్నికల ఫలితాల్లో కాంగ్రెస్ కి షాక్ ల మీద షాక్ లు తగులుతున్నాయి. ఇప్పటికే పలువురు సీనియర్ నేతలు ఓటమిపాలు కాగా అదే బాటలో ఆ పార్టీ సీనియర్‌ నేత, మాజీ మంత్రి జానారెడ్డి ఓటమి పాలయ్యారు. నల్గొండ జిల్లా నాగార్జున సాగర్‌ నుంచి బరిలోకి దిగిన జానారెడ్డి టీఆర్ఎస్ అభ్యర్థి నోముల నర్సింహయ్య చేతిలో ఓడిపోయారు. జానారెడ్డికి కంచుకోటలా ఉన్న ఈ నియోజకవర్గంలో స్థానికేతరుడైన నర్సింహయ్య గెలుపొందడం విశేషం. 2014 ఎన్నికల్లో 16,476 ఓట్ల తేడాతో జానారెడ్డి చేతిలో నోముల ఓటమి పాలయ్యారు.