లోయలో స్కూల్ బస్సు...12 మంది మృతి..

 

జ‌మ్మూకాశ్మీర్‌లో  ఘోర బస్సు ప్రమాదం చోటుచేసుకుంది. లోయలో స్కూల్ బస్సు పడి 12 మంది  విద్యార్ధులు మృతి చెందారు. వివరాల ప్రకారం... జ‌మ్మూకాశ్మీర్‌లోని విద్యార్ధులు ప్ర‌యాణిస్తున్న స్కూల్ బ‌స్సు లోయ‌లో ప‌డిపోయింది. విద్యార్ధులు రాజౌరి స్కూల్ నుంచి విహార‌యాత్ర‌కు వెళ్లివ‌స్తుండ‌గా ఈ ఘ‌ట‌న చోటుచేసుకుంది. బ‌స్సులో మొత్తం 40 మంది విద్యార్ధులు ఉన్నారు. 12 మందికిపైగా విద్యార్ధులు మృతి చెంద‌గా...మ‌రికొంద‌రికి తీవ్ర‌గాయాలయ్యాయి. గాయపడిన వారిని ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు.