పాక్ కవ్వింపు చర్యలు.. ఇద్దరు బాలురు మృతి..

 


పాక్ సైన్యం సరిహద్దు ప్రాంతంలో మరోసారి కాల్పులకు తెగబడింది. పాక్ చేస్తున్న కవ్వింపు చర్యలకు జవాన్లతో పాటు, సాధారణ పౌరులు కూడా నష్టపోతున్నారు. పాక్ బ‌ల‌గాలు జ‌మ్ముక‌శ్మీర్‌లోని సాంబా, నౌషేరా ప్రాంతాల్లో కాల్పులకు తెగబడుతున్న సంగతి తెలిసిందే. అయితే, సాంబా ప్రాతంలోని రామ్‌గ‌ఢ్ సెక్టార్‌లో పాక్ రేంజ‌ర్ల కాల్పుల‌తో ఇద్ద‌రు బాలురు మృతి చెందారు. మ‌రో 8 మందికి గాయాల‌య్యాయి. భార‌త్ దాడుల‌ను తిప్పికొడుతూ గట్టిగా బుద్ధి చెబుతోన్నా పాకిస్థాన్ త‌మ తీరు మార్చుకోవ‌డం లేదు. రెచ్చిపోయి మ‌రీ కాల్పులు జ‌రుపుతూ సామాన్యుల‌ను బ‌లిగొంటోంది.