పాక్ క్రూరత్వం.. భారత సైనికుడిని ముక్కలుగా నరికి...

 

పాకిస్థాన్ ఇప్పటికే భారత్ సరిహద్దుల్లో పలుమార్లు కాల్పుల విరమణ ఒప్పందాన్ని ఉల్లంఘించి కాల్పులకు తెగబడుతున్న సంగతి తెలిసిందే. ఇప్పుడు మరో దారుణానికి ఒడిగట్టారు ఉగ్రవాదులు. బీఎస్ఎఫ్ కు చెందిన ఒక సైనికుడిని అత్యంత అమానుషంగా హతమార్చింది. కశ్మీర్‌ లో చొరబడ్డ ఉగ్రవాదులపై కాల్పులు జరుపుతూ వెళ్లిన సైనికుడిని ఉగ్రవాదులు ముక్కలు ముక్కలుగా నరికి చంపారు. కుప్వారా జిల్లాలోని మచ్చిల్ సెక్టార్ లో సైనికుడు తల, శరీర భాగాలను ఖండించారని బీఎస్ఎఫ్ తెలిపింది. అయితే ఇంతకు ఇంత తీర్చుకుంటామని వారు హెచ్చరించారు. ఈ దాడి సైనికుల సమక్షంలోనే జరిగి ఉంటుందని వారు అనుమానం వ్యక్తం చేశారు.