కశ్మీర్‌లో భారీ ఎన్‌కౌంటర్

కశ్మీర్‌లో భారీ ఎన్‌కౌంటర్ జరుగుతోంది. ఉత్తర కశ్మీర్‌లోని హంద్వార ప్రాంతంలో ఉగ్రవాదులు ఉన్నారన్న సమాచారంతో భద్రతా దళాలు, కశ్మీర్ పోలీసులు ఆ ప్రాంతాన్ని దిగ్బంధించి గాలింపు చర్యలు చేపట్టాయి. దీంతో ఉగ్రవాదులు కాల్పులకు దిగారు.. అప్రమత్తమైన భద్రతా దళాలు వెంటనే ఎదురుకాల్పులకు దిగాయి. ఈ కాల్పుల్లో ఇప్పటి వరకు ఒక ఉగ్రవాది హతమైనట్లు సమాచారం. మరో ఇద్దరు ఉగ్రవాదులు ఇంకా అక్కడే నక్కినట్లు భావిస్తున్నారు. కాల్పులు ఇంకా కొనసాగుతుండటంతో మరిన్ని భద్రతా బలగాలు ఆ ప్రాంతానికి చేరుకున్నాయి. అధికార పీడీపీ నేత మొహిద్ అష్రఫ్ పీర్ ఇంటిపై ఉగ్రవాదులు దాడి చేసిన తర్వాతి రోజే ఈ దాడి జరగడం గమనార్హం.