పన్నీర్ సెల్వంకు నిరాశ

జల్లికట్టుకు కేంద్ర ప్రభుత్వం ఆర్డినెన్స్ జారీ చేసేందుకు గ్రీన్ సిగ్నల్ ఇవ్వడంతో పోటీలను రాష్ట్రప్రభుత్వం తరపున నిర్వహిస్తామని ప్రకటించారు తమిళనాడు ముఖ్యమంత్రి పన్నీర్ సెల్వం. దీనిలో భాగంగా మధురై జిల్లా అలంగనల్లూరులో జల్లికట్టును ప్రారంభించాలని భావించారు సీఎం. ఈ సందర్భంగా అక్కడికి వచ్చిన పన్నీర్ సెల్వంకు స్థానికుల నుంచి నిరసనలు వ్యక్తమయ్యాయి. ఆర్డినెన్స్ వచ్చినా సంతృప్తి చెందని తమిళ తంబీలు శాశ్వత పరిష్కారం కావాలని సీఎంను నిలదీశారు. దీంతో దిండిగల్‌లో జల్లికట్టును ప్రారంభించాలనుకున్న సెల్వానికి అక్కడ కూడా ఇదే పరిస్థితి కనిపించింది. అక్కడి ప్రజలు నిరసనలు కొనసాగించడం, ఎద్దులను సిద్ధం చేయకపోవడంతో చేసేదేమీ లేక ముఖ్యమంత్రి చెన్నైకి తిరుగు పయనమయ్యారు.