మసూద్ అజర్ ఓ ఉగ్రవాది...
posted on Oct 28, 2016 12:27PM
పాకిస్థాన్ కు చైనా ఎప్పుడూ మద్దతు పలుకుతుందన్న విషయం అందరికి తెలిసిందే. జైషే మమ్మద్ చీఫ్ మసూద్ అజర్ ఓ ఉగ్రవాది అని అతనిపై నిషేదం విధించాలని భారత్ ఐరాస్ లో మొత్తుకున్నా చైనా దానికి అడ్డుకట్ట వేసింది. అయితే ఇప్పుడు ఈ విషయంపై స్పందించిన పాకిస్థాన్ మాజీ అధ్యక్షుడు పర్వేజ్ ముషారఫే నిజం చెప్పి అందరికి షాకిచ్చాడు. జైషే మమ్మద్ చీఫ్ మసూద్ అజర్ ఓ ఉగ్రవాది అని.. తమ దేశంలోనూ అతను బాంబు పేలుళ్లు చేశాడని చెప్పారు. అంతేకాదు మరి అతన్ని అంతర్జాతీయ ఉగ్రవాదిగా ప్రకటించడాన్ని చైనా ఎందుకు అడ్డుకుంటోందని ప్రశ్నించగా..అతనితో చైనాకు ఏం సంబంధమని ఎదురు ప్రశ్నించారు. భారత్లో పాక్ హైకమిషన్ ఉద్యోగి గూఢచర్యం చేస్తున్న కేసు గురించి ప్రస్తావించగా.. మొదట ఆ విషయం తనకు తెలియదని.. నిజంగా అలా జరిగి ఉంటే.. అలాంటివాటిని ప్రోత్సహించకూడదని స్పష్టంచేశారు. నవాజ్ షరీఫ్ ప్రభుత్వ తీరుపై స్పందించిన ఆయన నవాజ్ షరీఫ్ ప్రభుత్వంలో దూకుడు లేదని అన్నారు. మరి మసూద్ అజర్ ని ఉగ్రవాది అన్న ముషారఫ్ వ్యాఖ్యలకు పాక్ ఎలా స్పందిస్తుందో చూద్దాం..