సీమాంద్ర కేంద్ర మంత్రులతో జైరాం భేటీ దేనికోసం?

 

 

 

సీమాంద్ర కేంద్ర మంత్రులకు మళ్లీ పిలుపు వచ్చింది. అయితే కేంద్ర మంత్రి జైరాం రమేష్‌, సీమాంధ్ర కేంద్ర మంత్రుల్ని తనతో భేటీ అవ్వాల్సిందిగా సమాచారం పంపడం సర్వత్రా చర్చనీయాంశమయ్యింది. రాష్ట్ర విభజన స్వరూపాన్ని డిజైన్‌ చేస్తోంది జైరాం రమేష్‌.. అంటూ ప్రచారం జరుగుతున్న విషయం విదితమే. ఈ నేపథ్యంలోనే జైరాం రమేష్‌, సీమాంధ్ర కేంద్ర మంత్రులతో భేటీకి సిద్ధమవడం అందర్నీ ఆశ్చర్యపరుస్తోంది. భద్రాచలం సీమాంధ్రలోనే వుండాలనీ, హైద్రాబాద్‌ని యూటీ చేయాలనీ జైరాం రమేష్‌ ప్రతిపాదనలు చేశారంటూ ఓ నివేదిక ఒకటి బయటకొచ్చిందామధ్య. దాంతో, జైరాం రమేష్‌ - సీమాంధ్ర కేంద్ర మంత్రులకు ఏం సమాచారమిస్తారు.? సీమాంధ్ర కేంద్ర మంత్రుల నుంచి ఆయన కొత్తగా ఏం తెలుసుకుంటారు.? అనే విషయాలపై తీవ్ర ఉత్కంఠ నెలకొంది.