TeluguOne Health
● # Tweets

Download the TeluguOne App

Choose your platform to continue

బీజేపీ కుట్ర..మీనాక్షి నటరాజన్ నామినేషన్ తిరస్కరణపై జగ్గారెడ్డి ఫైర్

Published on: Fri Jun 12, 2026 12:53PM

తెలంగాణ కాంగ్రెస్ వ్యవహారాల ఇంచార్జ్ మీనాక్షి నటరాజన్ రాజ్యసభ నామినేషన్ తిరస్కరణకు గురవ్వడంపై టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ జగ్గారెడ్డి  ఆగ్రహం వ్యక్తం చేశారు.  ఆమె నామినేషన్ తిరస్కరణను బీజేపీ పక్కా ప్రణాళికతో చేసిన రాజకీయ కుట్రగా అభివర్ణించారు. జాతీయ మీడియాతో మాట్లాడిన జగ్గారెడ్డి..  మధ్యప్రదేశ్ లోని బీజేపీ ప్రభుత్వం ఎన్నికల కమిషన్‌ను పావుగా వాడుకుని, ఉద్దేశపూర్వకంగానే మీనాక్షి నటరాజన్ నామినేషన్‌ను అడ్డుకుందని ఆరోపించారు.

 మీనాక్షి నటరాజన్  అత్యంత నిజాయతీ గల మహిళా నాయకురాలన్న జగ్గారెడ్డి.. . ఆ ఆమెపై ఎలాంటి క్రిమినల్ కేసులు నమోదు కాలేదు. కోర్టుల్లో ఎటువంటి న్యాయపరమైన వివాదాలు పెండింగ్‌లో లేవన్నారు.   ఇంతటి క్లీన్ రికార్డ్ ఉన్న నాయకురాలి నామినేషన్‌ను తిరస్కరించడం అత్యంత దురదృష్టకరమని, ఇది అన్యాయమైన, పిరికిపంద చర్య  అని జగ్గారెడ్డి విమర్శించారు.