ఎపి సీఎం పోలవరం తొలి పర్యటన

 

 

ఎపిలోని గత రాష్ట్ర ప్రభుత్వం సోమవారాన్ని పొలవారం గా ప్రకటించి ప్రతి సోమవారం పోలవరం ప్రాజెక్టు నిర్మాణం పై సమీక్షలు నిర్వహించిన విషయం తెలిసిందే. ఐతే కొత్త ప్రభుత్వం ఏర్పాటైన తరువాత తోలి సరిగా  ఏసీ సీఎం వైఎస్ జగన్ గురువారం పోలవరం ప్రాజెక్టు స్థలం సందర్శించనున్నారు. పోలవరానికి సంబంధించి అన్ని అంశాలపైనా జగన్ సమీక్ష నిర్వహిస్తారని ఏపీ జలవనరుల శాఖ మత్రి అనిల్ కుమార్ యాదవ్ ఈ రోజు తెలిపారు. జగన్  పోలవరం పనుల పురోగతికి సంబంధించి అధికారులతో మాట్లాడి పూర్తి వివరాలు తెలుసుకుంటారని చెప్పారు. గురువారం వైఎస్‌ జగన్‌ పోలవరం ప్రాజెక్టును సందర్శించి అధికారులతో పూర్తి స్థాయి సమీక్షా సమావేశం నిర్వహిస్తారు.