జగన్ ది ఆమె వాదమాట

 

 

 

ఇప్పటిదాకా వైసీపీ అధ్యక్షుడు జగన్ మోహన్ రెడ్డి తనది సమైక్యవాదమంటున్నారు. కాదు అతనే అసలైన విభజనవాది అని ప్రత్యర్ధులు వాదిస్తున్నారు. ఇవన్నీ కాదు జగన్ మోహన్ రెడ్డి 'సోనియావాది' అంటూ టిడిపి ఎమ్మెల్యే ధూళిపాళ నరేంద్ర కొత్తగా సూత్రికరించారు. సోనియాగాంధీకి భయపడే ఆయన తన పార్టీల ఎపిఎన్జీవోల సమావేశానికి దూరంగా ఉంచారని ఆయన ఆరోపించారు. సమైక్య ఉద్యమం పేరుతో జగన్ సోనియా ఆదేశాలు అమలు చేస్తున్నారని, ఎపిఎన్జీవోల సమావేశానికి హాజరుకాకపోవడ౦తో ఆయన నిజస్వరూపం బయటపడిందన్నారు. జగన్ అహంకార౦తో ప్రవరిస్తున్నారని దుయ్యబట్టారు.