తల్లి, చెల్లిపై జగన్ సంచలన ఆరోపణలు.. చీటింగ్ చేశారంటూ ఎన్సీఎల్టీలో కౌంటర్

posted on: Mar 7, 2025 8:55AM

తల్లీ చెల్లితో ఆస్తుల పంచాయతీ పెట్టుకున్న జగన్ వారిపై తీవ్ర ఆరోపణలు చేయడానికి సైతం వెనుకాడటం లేదు. వైఎస్ కుటుంబ ఆస్తుల తగాదా ఇప్పటికే రచ్చకెక్కింది. అది ఇప్పుడు మరింత తీవ్ర రూపం దాల్చింది. ఈ ఆస్తుల పంచాయతీలో జగన్, ఆయన భార్య భారతీ రెడ్డీ ఒక వైపు, జగన్ తల్లి విజయమ్మ, సోదరి షర్మిల ఒక వైపు నిలిచారు.  ముఖ్యంగా సరస్వతి పవర్ కంపెనీ షేర్ల విషయంలో   వివాదం హైదరాబాద్ లోని నేషనల్ కంపెనీస్ లా ట్రిబ్యూనల్ (ఎన్సీఎల్టీ) కు ఎక్కింది. ఇరు వర్గాలూ అంటే జగన్ , భారతీ, విజయమ్మ, షర్మిలలు ఒకరిపై ఒకరు ఆరోపనలు గుప్పించుకున్నారు. ఈ కేసులో ఎన్సీఎల్టీలో ఎప్పటికప్పుడు విజయమ్మ, జగన్ లు పిటిషన్లు, కౌంటర్లు దాఖలు చేసుకుంటున్నారు. ఒకరు ముందు దాఖలు చేసిన పిటిషన్ పై మరొకరు కౌంటర్ దాఖలు చేస్తున్నారు. దానినీ కౌంటర్ చేస్తూ మళ్లీ పిటిషన్లు, కౌంటర్లు దాఖలు అవుతున్నాయి. 

ఇటీవల వైస్ జగన్ తల్లి వైఎస్ విజయమ్మ దాఖలు చేసిన పిటిషన్ లో సరస్వతి పవర్తో జగన్ కు కానీ, భారతికి కానీ అసలు సంబంధం లేదనీ, ఈ కంపెనీలో వారికి అసలు వాటాలే వేవనీ ఎన్సీఎల్టీకి తెలిపారు.  కంపెనీకి చెందిన  99 శాతం షేర్లు తన పేరు మీదే ఉన్నాయని  విజయమ్మ తన పిటిషన్ లో  కుండబద్దలు కొట్టినట్లు చెప్పారు. 

దీనిపై జగన్ తాజాగా కౌంటర్ దాఖలు చేశారు. దానిలో ఆయన తల్లి విజయమ్మ, సోదరి షర్మిలపై తీవ్రమైన ఆరోపణలు చేశారు.  తన పేరు, తన సతీమణి భారతి పేర్లపై ఉన్న షేర్లను తమకు తెలియకుండానే విజయమ్మ, షర్మిలలు వారి పేర్ల మీదకు మార్చుకున్నారని జగన్ సంచలన ఆరోపణ చేశారు.   తన సంతకాన్ని తీసుకోకుండానే  షేర్లను వారి పేర్లపైకి బదలాయించుకున్నారనీ, ఆ షేర్ల  బదలాయింపును నిలుపుదల చేయాలని ఆయనఎన్సీఎల్టీని అభ్యర్థించారు. ఈ మేరకు విజయమ్మ, షర్మిలలతో  పాటు సండూర్ పవర్, రిజిస్ట్రార్ ఆప్ కంపెనీస్  ను ఆయన ప్రతివాదులుగా పేర్కొన్నారు. జగన్ వాదనపై కౌంటర్లు దాఖలు చేసేందుకు విజయమ్మ తరఫు న్యాయవాదులు సమయం కోరడంతో కేసు తదుపరి విచారణను వచ్చే నెల 3కు ఎన్సీఎల్టీ వాయిదా వేసింది.

google-ad-img
    Related Sigment News
    • Loading...