అశోక్ బాబు దెబ్బకు జగన్ మైండ్ బ్లాక్..!!

 

 

 

అశోక్ బాబు దెబ్బకు వైకాపా అధినేత జగన్ మోహన్ రెడ్డికి మైండ్ బ్లాక్ అయ్యిందని రాజకీయవర్గాలలో గుసగుసలు వినిపిస్తున్నాయి. ఆదివారం జరిగిన ఏపీఎన్జీవో ఎన్నికల్లో ప్రస్తుత అధ్యక్షుడు పరుచూరి అశోక్‌బాబు ప్యానల్ ఘనవిజయం సాధించింది. వైసీపీ అధినేత జగన్ అండదండలు ఉన్నాయని ప్రచారం జరిగిన బషీర్ ప్యానల్ అశోక్ బాబుకు కనీస పోటీని కూడా ఇవ్వలేక ఘోరంగా ఓడిపోయింది.

 

ఏపీఎన్జీవో ఎన్నికలకు..మెయిన్ స్ట్రీం రాజకీయలకు అసలు సంబంధం లేదు. రాష్ట్రంలో మారిన రాజకీయ పరిస్థితులలో ఏపీఎన్జీవోలు  సమైక్యాంధ్ర ఉద్యమానికి వేదికగా నిలిచి ఒక్కసారిగా వెలుగులోకి వచ్చారు. ఎంతగా వచ్చారంటే రాజకీయ ఎన్నికలను ప్రభావితం చేసే స్థాయిలో వారి సంఘం ఉంది. ఈ పరిస్థితిని తనకు అనుకూలంగా మలచుకోవాలని ఆనుకున్న జగన్... తమకు మద్దతు ఇవ్వాలని ఏపీఎన్జీవోలను కోరారని, ఆయన ప్రతిపాదనను ఏపీఎన్జీవోలు నిర్ద్వంద్వంగా తోసిపుచ్చారని కథనాలు వచ్చిన సంగతి తెలిసిందే.



అశోక్‌బాబుపై తీవ్ర అసంతృప్తిని పెంచుకున్న జగన్.. ఏపీఎన్జీవో సంఘాల ఎన్నికల్లో వారిని ఓడించాలని కంకణం కట్టుకున్నారట. ఒక పక్క అశోక్ బాబు ఎవరో తెలియదంటూనే..అశోక్ బాబు ప్యానల్‌కు పోటీగా వారు బషీర్ ప్యానల్‌ను రంగంలోకి దించినట్లు కథనాలు వచ్చాయి . ఈ క్రమంలోనే పెద్దఎత్తున డబ్బు చేతులు మారినట్లు కూడా ఉద్యోగ సంఘాల నేతలు ఆరోపించారు. కడప సహా మరికొన్ని జిల్లాల్లో వైసీపీ నేతలు క్యాంపులను ఏర్పాటు చేయడం, మరికొన్ని జిల్లాల్లో డబ్బు పంపిణీ వంటి వ్యవహారాలు బయటకు పొక్కాయి. అయితే జగన్ వర్గీ౦ ఎంత తీవ్రంగా ప్రయత్నించినా చివరికి అశోక్ బాబునే ఉద్యోగులు చక్రవర్తిని చేశారు.  ఏపీఎన్జీవో ఎన్నికలను గుప్పిట పట్టాలని భావించిన జగన్‌కు ఉద్యోగులిచ్చిన షాక్ కి మైండ్ బ్లాక్ కాదు..రెడ్..ఎల్లో కూడా అయిందని రాజకీయ వర్గాలు చెవులు కొరుక్కుంటున్నాయి.