లోటస్‌పాండ్ మీటింగ్... 20 మంది ఎమ్మెల్యేల డుమ్మా...

 

వైసీపీ అధ్యక్షుడు జగన్ హైదరాబాదులోని లోటస్‌పాండ్‌లో వున్న గల తన నివాసంలో ఆదివారం పార్టీ సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో 20 మంది వైసీపీ ఎమ్మెల్యేలు పాల్గొనకపోవడం రాజకీయవర్గాల్లో చర్చకి కారణమైంది. ఈ సమావేశానికి దాదాపు 20 మంది ఎమ్మెల్యేలు హాజరు కాలేదు. ఆదివారం ఉదయం 10 గంటలకు జరగాల్సిన వైసీపీఎల్పీ సమావేశం 20 మంది పార్టీ శానససభ్యులు హాజరు కాకపోవడంతో పార్టీ అధ్యక్షుడు జగన్ వారి కోసం ఎదురుచూసి రెండు గంటలు ఆలస్యంగా ప్రారంభించారు. ఆలస్యంగా కూడా వారు రాలేదు. ప్రయాణ సౌకర్యం లేనందున, వ్యక్తిగత పనుల కారణంగా రాలేకపోతున్నట్లు కొంత మంది తెలియజేసినట్లు సమాచారం. అయితే, కొంత మంది మాత్రం ఏ విధమైన సమాచారం ఇవ్వలేదని అంటున్నారు. దీంతో జగన్ తీవ్రంగా మండిపడినట్లు చెబుతున్నారు. సమావేశానికి హాజరు కాని ఈ 20 మంది ఎమ్మెల్యేలు తెలుగుదేశం పార్టీకి చేరువ అవుతున్నారన్న అనుమానాలు కలుగుతున్నాయి.