జగన్ బంపర్ ఆఫర్... లక్షకోట్లలో పదిశాతం...

 

వైసీపీ నాయకుడు జగన్ తెలుగుదేశం పార్టీకి బిగ్ ఆఫర్ ఇచ్చారు! తన వద్ద లక్ష కోట్లు ఉన్నాయని టీడీపీ నేతలు పదేపదే ఆరోపిస్తున్నారని, తన దగ్గర అంత డబ్బు ఉంటే.. పది శాతం తనకు ఇచ్చి మిగతాది టీడీపీ నేతలు తీసుకోవచ్చని చెప్పారు. తనకు సంబంధం లేని పరిటాల రవి హత్య కేసులో తనపై దుష్ప్రచారం చేస్తున్నారని, పరిటాల హత్య కేసులో ఆరోపణలు ఎదుర్కొన్న జేసీ బ్రదర్స్‌ను తెలుగుదేశం పార్టీలో ఎందుకు చేర్చుకున్నారని ప్రశ్నించారు. బడ్జెట్‌లో రుణమాఫీకి లక్ష కోట్లు కేటాయించాలని వైయస్ జగన్ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. రుణమాఫీకి లక్ష కోట్లు కేటాయించకపోతే ప్రభుత్వాన్ని నిలదీస్తామని హెచ్చరించారు.