TeluguOne Health
● # Tweets

Download the TeluguOne App

Choose your platform to continue

నేడు రాజధాని రైతులతో జగన్ సమావేశం...దేనికో?

Published on: Mon Oct 26, 2015 7:54AM

 

వైకాపా అధ్యక్షుడు జగన్మోహన్ రెడ్డి మొదటి నుండి రాజధాని భూసేకరణను వ్యతిరేకిస్తున్నారు. అయినప్పటికీ రాష్ట్ర ప్రభుత్వం ఆ ప్రక్రియను పూర్తి చేసి అమరావతి శంఖుస్థాపన కార్యక్రమం కూడా పూర్తి చేసింది. జగన్మోహన్ రెడ్డి ఆ కార్యక్రమాన్ని బహిష్కరించడం ద్వారా తనకి రాజధాని నిర్మాణం జరగడం ఇష్టం లేదని స్వయంగా ద్రువీకరించినట్లయింది. రాజధానికి శంఖుస్థాపన జరిగిన తరువాత కూడా ఇంకా దానికి ఆయన అడ్డంకులు సృష్టించే ప్రయత్నాలు మానుకొన్నట్లు లేదు. ఇవ్వాళ్ళ ఆయన ఉద్దండరాయునిపాలెంలో రైతులతో సమావేశంకానున్నారు. త్వరలో రాజధాని నిర్మాణ కార్యక్రమాలు పెద్ద ఎత్తున మొదలయ్యే అవకాశం ఉంది. మరి ఆయన వాటిని అడ్డుకొనేందుకు ఏదయినా వ్యూహరచన చేయడానికే రైతులతో సమావేశం అవుతున్నారేమో అనే అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. ఆర్టీసీ బస్ చార్జీల పెంపును నిరసిస్తూ ఇవ్వాళ్ళ ఆయన గుంటూరులో ఆర్టీసీ బస్సు డిపో ఎదురుగా ధర్నా నిర్వహించబోతున్నారు.ఆ తరువాత ఉద్దండరాయునిపాలెం వెళ్లి అక్కడి రైతులతో సమావేశంకానున్నారు