17 సార్లు కట్ చేశారు.. జగన్ ఆక్రోశం...

 

జగన్ ఆవేదన చూడటానికి రెండు కళ్ళు చాలటం లేదు.. ఆయన ఆక్రోశం వినడానికి రెండు చెవులూ సరిపోవడం లేదు. అసెంబ్లీలో తాను మాట్లాడుతుంటే 17సార్లు మైక్ కట్ చేశారని ప్రతిపక్ష నేత, వైకాపా అధినేత జగన్మోహన్ రెడ్డి ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. అసెంబ్లీని విజయవంతంగా వాయిదా ‘వేయించిన’ తర్వాత ఆయన మీడియాతో మాట్లాడారు. తాను ప్రజల పక్షాన మాట్లడుతుంటే అధికార పార్టీ అడ్డుపడిపోతోందని ఆరోపించారు. అసెంబ్లీ సమావేశాలు చాలా అన్యాయ భరితంగా జరిగాయని ఆయన ఆరోపించారు. వాకౌట్ చేస్తానన్నా తనకు మైకు ఇవ్వలేదని వాపోయారు. తాను ఎవరినీ వ్యక్తిగతంగా దూషించకపోయినప్పటికీ తన మైక్‌ని 17 సార్లు కట్ చేశారని జగన్ చెప్పారు. అధికారపక్షం ఎంత సేపు మాట్లాడినా కాదనట్లేదని.. వారు వై.ఎస్.రాజశేఖరరెడ్డిని దూషిస్తున్నారని జగన్ విచారం వ్యక్తం చేశారు.