జగన్ కు ఎదురుదెబ్బ

 

 

 

ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర విభజనను వ్యతిరేకిస్తూ దేశంలోని అన్ని ప్రాంతాలలో పర్యటించి రాష్ట్రం సమైక్యంగా ఉంచాలని కోరతానని ఇంతకుముందే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి సీబీఐ కోర్టుకు ధరఖాస్తు చేసుకున్నారు. తాజాగా విభజనకు సహకరించవద్దని ఆయన ఢిల్లీలోని జాతీయ పార్టీల నేతలను కలిసి వచ్చారు. అయితే ఈ రోజు కోర్టు జగన్ దేశ పర్యటనకు అభ్యంతరాలు తెలిపి పిటీషన్ ను తోసిపుచ్చారు. ఇప్పటికే రాష్ట్రంలోను, అలాగే డిల్లీకి పర్యటించడానికి అనుమతి ఇచ్చినందున దేశ పర్యటన చేయాల్సిన అవసరం లేదని, దేశంలోని మెజారిటీ పార్టీల నేతలు ఢిల్లీలో కలుస్తారని ..ఇంతకుముందే ఢిల్లీ పర్యటన చేసినందుకు దేశ పర్యటన చేయాల్సిన అవసరం లేదని కోర్టు తేల్చిచెప్పింది.