జగన్ పెట్టుబడిదారులను బెదిరించారు: సిబిఐ
Published on: Thu May 10, 2012 1:40PM
వైయస్ జగన్ ఆస్తుల కేసు విచారణలో భాగంగా మీడియా బ్యాంక్ ఖాతాల స్తంభన విషయంలో సిబిఐ గురువారం నాంపల్లి సిబిఐ ప్రత్యేక కోర్టులో కౌంటర్ దాఖలు చేసింది. జగన్ కంపెనీలలో పెట్టుబడులు స్వేచ్ఛగా పెట్టలేదని సిబిఐ తన కౌంటర్ పిటిషన్లో పేర్కొంది.తమ సంస్థలో పెట్టుబడులు పెట్టాలని ఎన్ఆర్ఐ మాధవచంద్రన్ను వైయస్ జగన్మోహన్ రెడ్డి, జగతి పబ్లికేషన్స్ వైస్ చైర్మన్ విజయ సాయి రెడ్డి బెదిరించారని సిబిఐ తెలిపింది. ఆయనను బెదిరింపులకు గురి చేసి రూ.39.60 కోట్లు పెట్టుబడులు పెట్టించారని అందులో పేర్కొన్నారు. లంచాలను పెట్టుబడుల రూపంలో చూపారని తెలిపారు.


