కాళ్లు మొక్కబోయిన జగన్.. వద్దన్న మోదీ

 

ప్రధాని మోదీ ఆదివారం తిరుపతికి వచ్చిన విషయం తెలిసిందే. మోదీ తిరుపతి పర్యటన సందర్భంగా ఆయనకు స్వాగతం పలికేందుకు వచ్చిన ఏపీ సీఎం వైఎస్ జగన్.. ప్రధానికి పాదాభివందనం చేయబోయారు. విమానం నుంచి కిందకి దిగి వస్తున్న మోదీకి జగన్ గులాబీతో స్వాగతం పలికారు. ప్రధానిని చూడగానే సీఎం పాదాభివందనం చేయబోయారు. ఒకసారి కాదు రెండు సార్లు జగన్ కాళ్లు మొక్కేందుకు ప్రయత్నించగా.. ప్రధాని వద్దని వారించారు. అనంతరం ఏదో మాట్లాడి భుజం తట్టారు. అప్పటికీ జగన్ వెనక్కి తగ్గారు. ఆ తర్వాత వరుసగా తన మంత్రివర్గ సహచరులు, ఇతర నేతలను ప్రధానికి పరిచయం చేశారు. ఇందుకు సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.