జగన్ బెయిల్ పై సిబిఐ హడావుడి: రేవంత్

 

jagan bail revanth reddy, revanth reddy jagan bail, tdp revanth reddy, jagan ysr congress

 

 

వైఎస్ఆర్.కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్ మోహన్ రెడ్డికి సిబిఐ కోర్ట్ బెయిల్ మంజూరు చేయడంపై టీడీపీ నేత రేవంత్ రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. జగన్ కేసులో దొంగ, పోలీస్ ఒకటయ్యారని ఆయన ఆరోపించారు. బెయిల్‌పై వాదనలు జరుగుతున్న సమయంలో హడావుడిగా అఫిడవిట్ దాఖలు చేయాల్సిన అవసరం ఏంటని ప్రశ్నించారు.

 

 

ఇదే కేసులో నిందుతుడిగా వున్న నిమ్మగడ్డ ప్రసాద్ కు సుప్రీం కోర్ట్ కు వెళ్ళిన బెయిల్ ఇవ్వలేదని..అలాంటిది భారీగా అక్రమాలకు పాల్పడిన జగన్‌కు బెయిల్ ఎలా వచ్చిందని ప్రశ్నించారు. ఈకేసులో 10 చార్జిషీట్లలో 1200 కోట్ల అక్రమాలు జరిగాయని సీబీఐ చెప్పింది. జగన్ బెయిల్‌ను సీబీఐ ఎందుకు అడ్డుకోలేదన్నారు. నాలుగు కేసుల్లో ముద్దాయిగా ఉన్న కార్మెల్ ఏషియాలో క్విడ్‌ప్రోకో లేదని ఎలా చెబుతారన్నారు.