జగన్ కు షాక్

 

Jagan assets case, ED, jagan CBI, jagan ED, Jagan assets attachment

 

 

వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు జగన్మోహన్‌రెడ్డికి చెందిన జగతి పబ్లికేషన్స్‌లో పెట్టుబడులపై ఈడీ న్యాయప్రాధికారిక సంస్థ సోమవారం మరో తీర్పు వెలువరించింది. రూ. 35 కోట్ల పెట్టుబడులు ఈడీ అటాచ్ చేయడం సరైనదేనని న్యాయప్రాధికార సంస్థ అభిప్రాయపడింది. జగతి పబ్లికేషన్స్‌లో పెట్టుబడులపై ఈడి తీర్పు జగన్‌కు షాక్ వంటిదని చెప్పవచ్చు. ఏకే దండమూడి, మాధవ్ రామచంద్రన్, టీఆర్ కన్నన్‌లు పెట్టిన పెట్టుబడులు నేరపూరితమైనవేనని, జగన్ వ్యాపారం న్యాయబద్ధమైనది కాదని, నేరపూరితం, అవినీతి, అధికార దుర్వినియోగంతో జగన్ వ్యాపార సంస్థలు నెలకొల్పారని ఈడీ న్యాయప్రాధికారిక సంస్థ తెలిపింది. డెలాయిట్ సంస్థ నివేదిక తప్పుల తడక అని ఈడీ పేర్కొంది.