జగన్ 420: మంత్రి దేవినేని

 

ఆంధ్రప్రదేశ్ భారీ నీటి పారుదల శాఖ మంత్రి దేవినేని ఉమామహేశ్వరరావు వైసీపీ నేత జగన్ మీద ఘాటు విమర్శలు చేశారు. జగన్మోహన్‌రెడ్డిని ఆయన ఫోర్ ట్వంటీ అని సంబోధించారు. తండ్రి అధికారాన్ని అడ్డు పెట్టుకుని జనం ప్రజల సొమ్మును అడ్డగోలుగా దోచుకున్నారని అందుకే జైలుపాలయ్యారని, భవిష్యత్తులో జగన్‌కి జైలే దిక్కని అన్నారు. జగన్ ఓ ఫోర్ ట్వంటీ కాబట్టే, సీబీఐ జగన్‌పై నమోదు చేసిన కేసులలో ఎక్కువ 420 కేసులే వున్నాయని దేవినేని గుర్తు చేశారు. ఈమధ్య కాలంలో తెలుగుదేశం నాయకులు జగన్ మీద విమర్శల దాడి, వేడి పెంచారు. జగన్ చంద్రబాబుకు వ్యతిరేకంగా నరకాసుర వధ కార్యక్రమాన్ని ప్రారంభించిన దగ్గర్నుంచి జగన్ మీద మాటల దాడి పెరిగింది.