జగన్ కు మరో షాకిచ్చిన ఈడీ... ఆస్తుల జప్తు

 

గత కొద్ది కాలంగా వైసీపీ అధినేత జగన్ కు వరుస ఎదురుదెబ్బలు తగులుతూనే ఉన్నాయి. ఏదో ఈమధ్యకాస్త ప్రశాంతంగా పాదయాత్ర చేసుకుంటూ పోతున్నారు. అయితే తాజాగా మరో షాక్ తగిలింది. ఈసారి షాకిచ్చింది కూడా ఈడీనే. గతంలో అక్రమాస్తుల కేసులో భాగంగా... జగన్ ఆస్తుల్ని ఈడీ అటాచ్ చేసిన సంగతి తెలిసిందే కదా. ఇప్పటికి చాలా సార్లు జగన్ ఆస్తుల్ని ఈడీ అటాచ్ చేసింది. కానీ ఇప్పుడు..  ఆస్తులు జప్తు చేస్తున్నట్టు పత్రికా ప్రకటన జారీ చేసింది. దీనికి సంబంధించి ఓ ట్వీట్ కూడా చేసింది. తాజాగా 117.74 కోట్లు ఆస్తులు అటాచ్ చేసిన ఈడీ.. గృహ నిర్మాణ ప్రాజెక్ట్ లు.. అంతే కాదు, శ్యాం ప్రసాద్ రెడ్డి, ఇందు ప్రాజెక్ట్స్ ఆస్తులు కూడా అటాచ్ చేసినట్టు తెలిపింది. ఎంబసీ ప్రాపర్టీ డెవలప్మెంట్, వసంత ప్రాజెక్ట్ ఆస్తులు కూడా అటాచ్ చేసింది. దీంతో ఈడీ ఇచ్చిన షాక్ కు జగన్ క్యాంపులో ఆందోళన మొదలైంది. మొన్నటివరకూ.. నెమ్మదించిన జగన్ కేసులు, ఇప్పుడు మరో సారి స్పీడ్ పెంచుకున్నాయి...ఈ నేపథ్యంలో ఏమి జరుగుతుందో అనే టెన్షలో ఉన్నారు జగన్ అండ్ కో బ్యాచ్.