పోలీసులకు జగన్ వార్నింగ్...


వైసీపీ అధినేత జగన్మోహన్ రెడ్డి పోలీసులకు వార్నింగ్ లు ఇవ్వడం కొత్తేం కాదు. గతంలో ఒకసారి పోలీసులకు వార్నింగ్ ఇచ్చారు. ఇప్పుడు తాజాగా మరోసారి ఆయన పోలీసులకు వార్నింగ్ ఇచ్చాడు. కర్నూలు జిల్లా హుసేనాపురంలో నిర్వహించిన మహిళా సదస్సులో పాల్గొన్న జగన్... ఆంధ్రప్రదేశ్ లో ఎప్పటికీ చంద్రబాబు పాలన మాత్రమే ఉండదనే విషయాన్ని పోలీసులు గుర్తుంచుకోవాలని.. సదస్సుకు వస్తున్న మహిళలను అడ్డుకోవడం ఏంటని  పోలీసుల వైఖరిపై మండిపడ్డారు. పోలీసులు వారి డ్యూటీ మాత్రమే వారు చేసుకోవాలని... ప్రభుత్వం కోసం, టోపీ మీదున్న మూడు సింహాల కోసం మాత్రమే పని చేయాలని... ఆ సింహాల వెనకున్న గుంట నక్కలకు సెల్యూట్ కొట్టేందుకు మీరు పని చేయడం లేదనే విషయాన్ని గుర్తుంచుకోవాలని చెప్పారు.