కొత్త పాట పాడుతున్న జగన్...


ఏపీ ప్రతిపక్ష నేత జగన్ కు ప్రస్తుతం కాలం కలిసిరావట్లేదు. దీనికి ప్రత్యేకంగా వేరే కారణాలు ఏంటో చెప్పనక్కర్లేదు. జగన్ వైఖరే దానికి కారణం. ఈ విషయం కాస్త రాజకీయ పరిజ్ఞానం ఉన్నఎవర్నిఅడిగినా చెబుతారు. జగన్ మొండి వైఖరి, అదే క్రమంలో చిన్నా, పెద్ద అని లేకుండా అగౌరవంగా మాట్లాడే తీరు, ఇంకా చెప్పాలి అంటే మోనార్క్ మెన్‌ట్యాలిటీ జగన్ కు మైనస్ పాయింట్లే. అందుకే గత ఎన్నికల్లో ఓడిపోయి.. ప్రతిపక్ష నేతగా మిగిలిపోయాడు. ఈసారైనా నోటిని కాస్త అదుపులో పెట్టుకొని.. కాస్త ప్రజల సమస్యలపై దృష్టి పెడితే వచ్చే ఎన్నికల్లో గెలిచే ఛాన్స్ ఉండొచ్చు. అది మానేసి ఎంత సేపు అధికార పార్టీపై విమర్సలు గుప్పించడం.. ఇప్పుడు కొత్తగా.. స్వామీజీలను కలుస్తూ..వారి ఆశీర్వాదాలు తీసుకుంటున్నారు. ఏం చెబితే అది చేస్తున్నారు. నిలబడమంటే నిలబడుతున్నారు. కూర్చోమంటే కూర్చుంటున్నారు. అంతేకాదు ఇంకా ఆశ్చర్యకరమైన విషయం ఏంటంటే.. జగన్ ఓడిపోవడానికి కారణం ఆయన వైఖరి కాదంట. ఇంకేంటనుకుంటున్నారా..? వాస్తంటా.. జగన్ ఏ పని చేసిన కలసి రాకపోవడంతో కొందరు స్వామీజీలు జగన్ లోటస్ పాండ్ వాస్తు సరిగ్గా లేదు అని చెప్పడంతో జగన్ ఆలోచనలో పడ్డాడట. అంతేకాదు వారు చెప్పినట్టు మార్పులు చేయడానికి సిద్దపడుతున్నాడట. మొత్తానికి అదేదో సామెత చెప్పినట్టు అసలు జగన్ తన వైఖరి మార్చుకోకుండా.. ఎన్ని వాస్తులు మార్చితే ఏం లాభం. ఈ విషయం జగన్ ఎప్పుడు తెలుసుకుంటాడో పాపం..!