నేడు లండన్కు జగన్ దంపతులు
Published on: Fri Oct 10, 2025 9:35PM
.webp)
వైసీపీ అధినేత వైఎస్ జగన్ ఇవాళ రాత్రి లండన్ టూర్కు వెళ్లునున్నారు. మాజీ సీఎం తన సతీమణి భారతితో కలిసి బెంగళూరు నుంచి లండన్కి బయల్దేరనున్నారు. ఈ నెల 22 వరుకు దాదాపు రెండు వారాల పాటు ఈ పర్యటన సాగనుంది. లండన్లో విద్యాభ్యాసం చేస్తున్న తమ పెద్ద కుమార్తె వద్దకు జగన్ దంపతులు వెళుతున్నారు. కుటుంబ సభ్యులతో కొంతకాలం గడిపేందుకే ఈ పర్యటనను ఏర్పాటు చేసుకున్నట్లు తెలుస్తోంది. తిరిగి ఈ నెల 23న తిరిగి ఇండియాకు రానున్నారు


