ప్లీజ్... నా మాట వినండి..


పార్లమెంట్లో ఏపీ ప్రత్యేక హోదా డిమాండ్ చేస్తూ అవిశ్వాస తీర్మానం పెట్టిన సంగతి తెలిసిందే కదా. అయితే అవిశ్వాస తీర్మానం పెట్టినా...ఉభయ సభల్లో చర్చకు మాత్రం రావడంలేదు. ఈ నేపథ్యంలో దీనిపై వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైఎస్ జగన్ అన్ని పార్టీలకూ విజ్ఞప్తి చేశారు. తన ట్విట్టర్ ద్వారా అవిశ్వాస తీర్మానంపై చర్చకు సహకరించాలని కోరారు. కేంద్ర ప్రభుత్వంపై తాము అవిశ్వాస తీర్మానం పెట్టామని, దీనిపై చర్చ సాగకుండా బీజేపీ చూస్తోందని, ఇతర పార్టీలు లేవనెత్తుతున్న అంశాల గురించి తనకు అవగాహన ఉందని, అయితే ప్రత్యేక హోదాపై చర్చను అడ్డుకోవద్దని కోరుతున్నానని కోరారు. తన మాట వినాలని విజ్ఞప్తి చేశారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని విభజించే సమయంలో ఇదే పార్లమెంట్ లో హోదాపై హామీ ఇచ్చారని గుర్తు చేశారు. ఆంధ్రప్రదేశ్ ప్రజల కోసం వైఎస్ఆర్ కాంగ్రెస్ పోరాటం కొనసాగుతుందని స్పష్టం చేశారు.