ముగిసిన ఇవాంక టూర్.. హైదరాబాద్ గురించి ఏం చెప్పిందంటే...

 

పెద్ద గాలి దుమారం వచ్చి వెళిపోయిన తరువాత ఎంత సైలెంట్ గా ఉంటుందో.. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ కూతురు ఇవాంక ట్రంప్ హైదరాబాద్ వచ్చి వెళ్లిన తరువాత అంత ప్రశాంతంగా ఉంది. ఆమె వస్తుందని చెప్పిన వారం పదిరోజుల నుండి మొదలైన హడావుడికి..నిన్న ఆమె మళ్లీ తిరిగి అమెరికా ప్రయాణం అవ్వడంతో ఆగింది. హైదరాబాద్ లో జరిగిన జీఈఎస్ సదస్సులో పాల్గొనడానికి వచ్చిన ఆమె... రెండు రోజుల పాటు హైదరాబాదులో సందడి చేశారు. ఫలక్ నుమా ప్యాలస్ లో ఇచ్చిన విందుకు హాజరైన ఆమె... చారిత్రక గోల్కొండ కోటను కూడా సందర్శించారు. ఎంతో నిరాడంబరంగా గడిపిన ఆమె... అందరి మనసులను ఆకట్టుకున్నారు. అయితే హైదరాబాద్ పర్యటన అనంతరం ఆమె ఎలా స్పందిస్తుందా.. అని అందరూ ఆసక్తిగా ఎదురుచూశారు. అనుకున్నట్టే ఇవాంక హైదరాబాద్ పర్యటనపై తన ట్విట్టర్ లో స్పందించారు. హైదరాబాద్ పర్యటనను ముగించుకుని అమెరికాకు తిరిగి బయలుదేరే ముందు తమ ప్రతినిధులతో కలసి గోల్కొండ కోటను సందర్శించానని... అద్భుతమైన ఈ పర్యటనకు ఇది పరిపూర్ణ ముగింపు అని ఆమె ట్వీట్ చేశారు.