మోడీపై ఇవాంక ట్రంప్ పొగడ్తలు....


ఇవాంక ట్రంప్ జీఈఎస్ సదస్సులో పాల్గొంది. సదస్సులో పాల్గొనడం సంతోషంగా ఉంది..హైదరాబాద్ ప్రపంచ నగరంగా ఎదుగుతోంది అని ఇవాంక అన్నది. 70 ఏళ్ల భారత్ ప్రజాస్వామ్య విలువలకు నా అభినందనలు.. ప్రజాస్వామ్య విజయానికి భారత్ ఆశాదీపంగా ఉంది..అమెరికాకు భారత్ అసలైన మిత్రదేశం.. భారత్ అంతరిక్ష కేంద్రం చంద్రుడిని దాడి... మార్స్ వరకూ వెళ్లింది అని ఇవాంక వ్యాఖ్యానించింది. అంతేకాదు ఈ సందర్బంగా ఆమె మాట్లాడుతూ... ప్రధాని మోడీపై ప్రశంసలు కురిపించింది. ప్రధాని మోడీ పాలనలో భారత్ వేగంగా అభివృద్ధి చెందుతోంది.. టీ అమ్ముకునే స్ధాయినుండి ప్రధాని వరకు ఎదిగిన మీ ప్రస్ధానం అద్వితీయం.. భారత్ ను పేదరికం నుండి బయటపడేసేందుకు మోడీ ప్రయత్నిస్తున్నారు. మార్పు సాధ్యమని మోడీ నిరూపించారు..మార్పు సాధ్యమని నిరూపించిన మోడీకి ధన్యవాదాలు తెలిపారు.