డేటా చోరీ కేసులో ఐటీ గ్రిడ్ ఎండీ ఆశోక్‌కు బెయిల్

 

ఆధార్, ఇతర డేటా చోరీ వ్యవహారంలో ఆరోపణలు ఎదుర్కొంటున్న ఐటీ గ్రిడ్ ఎండీ ఆశోక్‌కు హైకోర్టు షరతులతో కూడిన బెయిల్‌ను మంజూరు చేసింది. ముందస్తు బెయిల్ కోసం అశోక్ ఈరోజు మరోమారు పిటిషన్ దాఖలు చేశారు. ఈ పిటిషన్ పై విచారణ జరిపిన హైకోర్టు షరతులతో కూడిన బెయిల్ మంజూరు చేస్తూ ఆదేశాలు జారీ చేసింది. దేశం విడిచి వెళ్లకూడదని, పోలీసులకు పాస్ పోర్టు అప్పగించాలని, వారంలో ఒక్క రోజు పోలీసుల విచారణకు హాజరు కావాలని హైకోర్టు ఆశోక్‌ను ఆదేశించింది.