టర్కీపై ఉగ్రపంజా..29 మంది మృతి

టర్కీపై మరోసారి ఉగ్రవాదులు పంజా విసిరారు. ప్రధాన నగరమైన ఇస్తాంబుల్‌లో  ఫుట్‌బాల్ స్టేడియంని టార్గెట్‌గా చేసుకుని జంట బాంబు పేలుళ్లకు తెగబడ్డారు. తొలి పేలుడు ఫుట్‌బాల్ స్టేడియం బయట జరగ్గా..రెండోది ఓ పార్క్ ఆవరణలో జరిగినట్లు సమాచారం. ఈ ఘటనలో 29 మంది మృతిచెందగా..166 మంది గాయపడ్డారు. మృతుల్లో ఎక్కువమంది పోలీసులు ఉన్నట్లు అధికార వర్గాలు తెలిపాయి. ఈ పేలుళ్లకు సంబంధించి ఇప్పటి వరకు 10 మంది నిందితులను అదుపులోకి తీసుకున్నట్లు సమాచారం. తొలి దాడిలో కారు బాంబును వినియోగించగా..రెండో దాడికి ఆత్మాహుతి బాంబర్‌ను ఉగ్రవాదులు వినియోగించినట్లు భావిస్తున్నారు. అయితే దాడి జరిగే సమయానికి మ్యాచ్ ముగియడంతో జనం ఇళ్లకు చేరుకున్నారు..లేదంటే ప్రాణనష్టం భారీగా ఉండేది..దాడికి బాధ్యత వహిస్తూ ఇంతవరకు ఇప్పటివరకు ఏ సంస్థ ప్రకటన జారీ చేయలేదు.