TeluguOne Health
● # Tweets

Download the TeluguOne App

Choose your platform to continue

ఇస్రో సైంటిస్ట్ సురృష్ హత్యకేసులో పురోగతి..

Published on: Thu Oct 3, 2019 3:16PM

 

హైదరాబాద్ లో ఇస్రో సైంటిస్ట్ సురేష్ హత్య కేసు దర్యాప్తులో పురోగతి కన్పిస్తుంది. ఎస్సార్ నగర్ లోని అన్నపూర్ణ అపార్ట్ మెంట్ రెండో ఫ్లోర్ లో నివాసముంటున్న శాస్త్రవేత సురేష్ రెండు రోజుల క్రితం హత్యకు గురయ్యాడు. క్లూస్ టీమ్ తో హత్య జరిగిన ప్రదేశాన్ని పోలీసులు క్షుణ్ణంగా పరిశీలించారు. అపార్ట్ మెంట్ వాచ్ మెన్ తో సహా స్థానికుల నుంచి వివరాలు సేకరించారు. హత్య జరిగిన రోజు శ్రీనివాస్ అనే వ్యక్తి సురేష్ ఇంటికి వచ్చాడు. హత్య తర్వాత అతను కనిపించడం లేదు, దీంతో ప్రధానంగా పోలీసులు శ్రీనివాస్ పై దృష్టి పెట్టారు, ప్రత్యేక బృందాలతో అతని కోసం వెతుకుతున్నారు. హత్యకు గురైన సురేష్ తలపై తీవ్ర గాయాలున్నట్లు గుర్తించారు, అక్కడి ఆనవాళ్లను ఎఫ్ఎస్ఎల్ కు పంపించారు. సీసీ కెమెరా ఫుటేజ్ ఆధారంగా దర్యాప్తు చేపట్టారు. వ్యక్తిగత కారణాలతోనే హత్య జరిగి ఉండవచ్చని అనుమానిస్తున్నారు. శాస్త్రవేత సురేష్ నేషనల్ రిమోట్ సెన్సింగ్ సెంటర్ అండర్ ఇస్రోలో పని చేస్తున్నాడు. మృతుడు కేరళవాసి, వృతిరీత్యా గత ముప్పై ఏళ్లుగా హైదరాబాద్ లో పనిచేస్తున్నాడు. సురేష్ భార్య బ్యాంకు ఉద్యోగిని చెన్నైలో నివాసముంటోంది. ఉద్యోగ రిత్యా కుమారుడు అమెరికాలో, కుమార్తె ఢిల్లీలో స్థిర నివాసం ఉంటున్నారు. ఇక హత్య చేసినట్లుగా భావిస్తున్న శ్రీనివాస్ స్వస్థలం గోదావరిఖనిగా చెబుతున్నా పోలీసులు ఇతని కోసం వెతుకుతున్నారు.