8ఉప గ్రహాలతో నింగిలోకి దూసుకెళ్లిన పీఎస్‌ఎల్వీ-సీ35..


ఏపీ, శ్రీహరి కోటలోని సతీష్ దావన్ అంతరిక్ష కేంద్రం (షార్) నుంచి పీఎస్‌ఎల్‌ వీ - సీ 35 విజయవంతంగా నింగిలోకి దూసుకెళ్లింది. శనివారం ఉదయం 9.12 గంటలకు మొదలైన కౌంట్ డాన్ ఈరోజు 9.12 గంటలకు పూర్తవడంతో.. ఈరోజు దానిని నింగిలోకి ప్రవేశపెట్టారు. ఎనిమిది ఉపగ్రహాలను ఒక్కసారే కక్ష్యలోకి ప్రవేశపెట్టారు. ఇలాంటి ప్రయోగం ఇస్రో నిర్వహించడం ఇదే తొలిసారి. ఈ ఎనిమిది శాటిలైట్లలో వాతావరణ అధ్యయన శాటిలైట్ ఎస్‌సీఏటీఎస్ఏటీ-1 తో పాటు రెండు దేశీయ శాటిలైట్లు, మరో ఐదు విదేశీ శాటిలైట్లు ప్రవేశపెట్టనున్నారు. అమెరికా, అల్జీరియా, కెనడా దేశాలకు చెందిన 5 ఉపగ్రహాలు, విద్యార్థులు తయారు చేసిన 2 ఉపగ్రహాలను పీఎస్‌ఎల్‌వీ-సి35 కక్ష్యలో ప్రవేశపెట్టనుంది. వీటి మొత్తం బరువు 675 కిలోలు. భూమికి 730 కిలోమీటర్ల ఎత్తులోని సూర్యానువర్తన ధ్రువ కక్ష్యలో వీటిని ప్రవేశపెడతారు. ప్రయోగం మొత్తం పూర్తికావడానికి 2.15 గంటల సమయం పట్టే అవకాశం ఉంది.