ఇస్రో మాజీ చీఫ్ మృతి....

 

ఇస్రో మాజీ చీఫ్, ప్రముఖ ఫిజిక్స్ శాస్త్రవేత్త ప్రొఫెసర్ ఎం.జీ.కే. మీనన్(88) కన్నుమూశారు. గత కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన తన తుదిశ్వాసను విడిచారు. 35 ఏళ్ల వయసులో టాటా ఇనిస్టిట్యూట్ ఆఫ్ ఫండమెంటల్ రీసెర్చ్‌కు డైరెక్టర్‌గా నియమితులయ్యారు. భారత అంతరిక్ష పరిశోధనా సంస్థకు 1972లో ఆయన ఛైర్మన్‌గా ఎన్నికయ్యారు. 1982-1989 వరకు ప్లానింగ్ కమిషన్ సభ్యుడిగా, 1986-1989 వరకు ప్రధాని శాస్త్ర సలహాదారుడిగా, 1989-1990 వరకు సీఎస్‌ఐఆర్ వైస్ ప్రెసిడెంట్‌గా, 1990-96 వరకు రాజ్యసభ సభ్యుడిగా ఆయన వివిధ హోదాల్లో తన సేవలను అందించారు. గత ఐదు దశాబ్దాలుగా దేశం శాస్త్ర, సాంకేతిక రంగంలో అభివృద్ధిపథంలో పయనించడానికి మీనన్ ఎంతో కృషిచేశారు. మీనన్‌కు భార్య, కుమారుడు, ఓ కుమార్తె ఉన్నారు.