ఉగ్రవాదులపై టర్కీ ఉక్కపాదం.. 104 మంది హతం..

 

ఇస్లామిక్ స్టేట్ ఉగ్ర‌వాదాలు ప్రంపచ దేశాల్ని గడగడలాడిస్తున్నసంగతి తెలిసిందే. ఇప్పటికే అగ్ర దేశాలు కూడా ఉగ్రవాదులపై ఉక్కపాదం మోపాయి. ఈ నేపథ్యంలోనే ఉగ్ర‌వాదుల ప‌ట్ల ట‌ర్కీ ప్ర‌భుత్వం క‌ఠినంగా వ్య‌వ‌హ‌రిస్తోంది. దీనిలో భాగంగానే.. ఉగ్ర స్థావ‌రాల‌పై దాడులు నిర్వహించగా..104 మంది ఉగ్రవాదులు హతమయ్యారు. ట‌ర్కీ మిల‌ట‌రీ హ‌త‌మార్చిన‌ ఉగ్ర‌వాదుల సంఖ్య 104గా భావిస్తున్నామ‌ని, అయితే వారి సంఖ్యపై క‌చ్చిత‌మైన వివ‌రాలు చెప్ప‌లేమ‌ని, దానిపై త‌మ వ‌ద్ద‌ స్ప‌ష్ట‌త లేద‌ని ట‌ర్కీ తెలిపింది. వైమానికి దాడుల‌తో పాటు ఇత‌ర మార్గాల్లోనూ ఉగ్ర‌వాదుల‌ను అంత‌మొందిస్తున్న‌ట్లు చెప్పింది.