TeluguOne Health
● # Tweets

Download the TeluguOne App

Choose your platform to continue

జాతీయ రహదార్లకు లగచర్ల అడ్డంకి  అయ్యిందా?

Published on: Fri Nov 29, 2024 2:54PM

లగచర్ల ఇండస్ట్రియల్ పార్క్ కోసం తెలంగాణ ప్రభుత్వం అభిప్రాయసేకరణ వివాదాస్పదం కావడంతో జాతీయ రహదారుల కోసం  భూసేకరణ సరిగ్గా జరగడం లేదని  తెలుస్తోంది. అవార్డ్ పాస్ అయిన భూములకు ఇంత వరకు నష్ట పరిహారం అందలేదనే ఫిర్యాదులు వస్తున్నాయి. అడ్వాన్స్ ఇవ్వకుండానే భూసేకరణ చేపడుతున్న అధికారులకు  రైతులు సహకరించడం లేదు. దీంతో రేవంత్ సర్కార్ కు విషయం అర్థమైంది.  రాష్ట్ర వ్యాప్తంగా సంచలనమైన లగచర్లను సాకుగా చేసుకుని రైతులు భూసేకరణకు ముందుకు రావడం లేదు. దీంతో లగచర్ల భూసేకరణ నిలిపివేస్తూ ఉత్తర్వులు జారి చేసింది. రైతుల నుంచి అడుగడుగునా వ్యతిరేకత రావడంతో రేవంత్ సర్కార్ అప్రమత్తమైంది. భూసేకరణ చేసే జాతీయ  రహదారుల ప్రాధికార సంస్థ(ఎన్ హెచ్ ఏ ఐ) ముఖ్యమంత్రికి లేఖ రాసినట్టు సమాచారం. ముఖ్యమంత్రి స్వంత నియోజకవర్గంలో రైతులు భూసేకరణకు సహకరించకపోతే జాతీయ ప్రాధికార సంస్థ  కు ఎలా సహకరిస్తారని  రోడ్లు, భవనాల శాఖామంత్రి కోమటిరెడ్డికి సూటిగా ప్రాధికార సంస్థ  ప్రశ్నించింది. రైతులకు అడ్వాన్స్ ఇవ్వకుండా భూములు ఇవ్వరని కోమటిరెడ్డి తేల్చేసి చెప్పినట్టు వార్తలు వస్తున్నాయి. 
రీజినల్ రింగ్ రోడ్డుకోసం ఇప్పటికే 95 శాతం భూములను  ప్రాధికార సంస్థ సేకరించింది. మిగతా ఐదు శాతం భూములను సేకరించిన తర్వాతే అవార్డ్ పాస్ అయిన భూములకు నష్టపరిహారం ఇవ్వాలని ప్రాధికారసంస్థ నిర్ణయించినట్టు కనబడుతోంది. శుక్రవారం లగచర్ల భూసేకరణ నిలుపుదల చేస్తూ ప్రభుత్వ నిర్ణయానికి ఇదే కారణమని తెలుస్తోంది